-
-
Home » Andhra Pradesh » Kadapa » suicide
-
యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-12-07T04:40:32+05:30 IST
మండల పరిధిలోని వద్దిరాల గ్రామానికి చెందిన షట్కారి గురుప్రవీణ్కుమార్ యాదవ్ (22) ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తలమంచిపట్నం హెడ్కానిస్టేబుల్ హరికృష్ణ తెలిపారు.

మైలవరం, డిసెంబరు 6 : మండల పరిధిలోని వద్దిరాల గ్రామానికి చెందిన షట్కారి గురుప్రవీణ్కుమార్ యాదవ్ (22) ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తలమంచిపట్నం హెడ్కానిస్టేబుల్ హరికృష్ణ తెలిపారు. ప్రవీణ్కుమార్కు మూ డేళ్ల వయస్సులో తల్లి, 15 ఏళ్ల వయస్సులో తండ్రి అనారోగ్యంతో మృతి చెందారు. ప్రవీణ్కు ఇద్దరు అన్నలున్నారు. వీరు వ్యవ సాయంతో పాటు గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగించే వారు. ఈ మధ్యనే కొత్త ఇల్లు నిర్మించుకున్నారు. కొన్ని రోజులుగా దాదాపు 70 గొర్రెలు వ్యాధితో మృతిచెందడంఒతో ప్రవీణ్కుమార్ మన స్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న తలమంచి పట్నం పోలీసులు వద్దిరాల గ్రామానికి చేరుకుని సంఘటనపై స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జమ్మలమడు గు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా ప్రవీణ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.