‘బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలి’
ABN , First Publish Date - 2020-12-20T05:22:10+05:30 IST
బీసీ కార్పొరేషన్లకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి కొలవళి వేణుగోపాల్ అన్నారు.

బద్వేలు, డిసెంబరు19: బీసీ కార్పొరేషన్లకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి కొలవళి వేణుగోపాల్ అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ ప్రభు త్వ బీసీలకు ఏమీ చేయలేదన్న చెడ్డపేరు రాకుండా ఉండేందుకు కార్పొరేషన్ల పేరిట హడావుడి చేశారన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ చైర్మన్లకు సహాయ మంత్రి హోదా ఉండేదని, రూ.2 లక్షలకు పైగా అలవెన్సులు అందించేవారన్నారు.