వైద్య కళాశాల నిర్మాణానికి రూ.500 కోట్లు విడుదల
ABN , First Publish Date - 2020-09-13T08:16:52+05:30 IST
వైద్య కళాశాల నిర్మాణానికి రూ.500 కోట్లు విడుదల
![వైద్య కళాశాల నిర్మాణానికి రూ.500 కోట్లు విడుదల](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
పులివెందుల, సెప్టెంబరు 12: పులివెందులలో వైద్య కళాశాల నిర్మాణం కోసం రూ.500 కోట్లు విడుదల చేస్తూ శనివారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్ జవహర్రెడ్డి జీవో విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పులివెందులలో 100 ఎంబీబీఎస్ సీట్లతో ఏర్పాటు కాబోయే ఈ కళాశాలలో మౌలిక సదుపాయాలు, సామాగ్రి, ఫర్నీచర్ కోసం నిధులు మంజూరు చేయాలని వైద్య విద్య డైరెక్టర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దీంతో పులివెందులలో వైద్య కళాశాల ఏర్పాటుకు రూ.500 కోట్ల మంజూరుకు పరిపాలన అనుమతులు ఇస్తూ శనివారం జీవో జారీ చేశారు.