రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షుడుగా బీఎల్‌

ABN , First Publish Date - 2020-12-12T05:10:47+05:30 IST

రాజంపేట పార్లమెంటు వైసీపీ ఉపాధ్యక్షుడుగా పెనగలూరుకు చెందిన సీనియర్‌ నాయకుడు బీఎల్‌ నరసింహారెడ్డిని నియమించినట్లు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కొండూరు విజయ్‌రెడ్డి తెలిపారు.

రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షుడుగా బీఎల్‌
నరసింహారెడ్డికి నియామకపత్రాన్ని అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే ప్రభావతమ్మ

పెనగలూరు, డిసెంబరు11 : రాజంపేట పార్లమెంటు వైసీపీ ఉపాధ్యక్షుడుగా పెనగలూరుకు చెందిన సీనియర్‌ నాయకుడు బీఎల్‌ నరసింహారెడ్డిని నియమించినట్లు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కొండూరు విజయ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే కొండూరు ప్రభావతమ్మ చేతుల మీదుగా ఆమె నివాసంలో నరసింహారెడ్డికి నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి తన నియామకానికి సహకరించిన ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే ప్రభావతమ్మకు ధన్యవాదాలు తెలిపారు. యానాదయ్యనాయుడు, ఎ.చిన్నా, వై.సురే్‌షరెడ్డి, బి.రవిరెడ్డి, పెంచలయ్య పాల్గొన్నారు.

Updated Date - 2020-12-12T05:10:47+05:30 IST