పబ్లిసిటీకి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం
ABN , First Publish Date - 2020-04-10T09:19:24+05:30 IST
సామాజిక దూరం, భౌతిక దూరాలను పక్కనబెట్టి విపత్కర పరిస్థితుల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో పబ్లిసిటీ కోసం డిప్యూటీ సీఎం అంజద్బాషా ఆ యన అనుచరులు
డిప్యూటీ సీఎంపై కలెక్టరుకు టీడీపీ నేత హరిప్రసాద్ ఫిర్యాదు
కడప(నాగరాజుపేట), ఏప్రిల్ 9 : సామాజిక దూరం, భౌతిక దూరాలను పక్కనబెట్టి విపత్కర పరిస్థితుల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో పబ్లిసిటీ కోసం డిప్యూటీ సీఎం అంజద్బాషా ఆ యన అనుచరులు పర్యటించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ ఆరోపించారు. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ సమయంలో బాధ్యత గల హోదాలో ప్రజలను గుంపులు గుంపులుగా చేయడం భావ్యం కాదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారులు, వలంటీర్ల ద్వారా కూరగాయలు పంపిణీ చేసి ఉంటే బాగుండేదన్నారు. వీరి చర్యల వల్ల నగరంలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ సంఘటనపై స్పందించి తగు చర్యలు చేపట్టాలని కలెక్టరును కోరారు.