సజ్జలను కలిసిన పోలీసు సంఘం
ABN , First Publish Date - 2020-12-16T05:06:14+05:30 IST
చాలా కాలంగా పరిష్కారానికి నోచుకోని సమస్యలపై రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం నేతలు ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డిని కలిశారు.
కడప(క్రైం), డిసెంబరు 15: చాలా కాలంగా పరిష్కారానికి నోచుకోని సమస్యలపై రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం నేతలు ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డిని కలిశారు. మంగళవారం విజయవాడలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి మస్తాన్, కోశాధికారి సోమశేఖర్రెడ్డిలతో కలిసి సంఘం గౌరవాధ్యక్షుడు నర్రెడ్డి చంద్రశేఖర్రెడ్డి సజ్జలకు సమస్య వివరించారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారని వారు పేర్కొన్నారు.