దివ్యాంగ ఉద్యోగికి వీల్‌చైర్‌ కోసం లక్ష రూపాయలు వితరణ

ABN , First Publish Date - 2020-12-18T05:08:18+05:30 IST

వార్డు వెల్ఫేర్‌ సెక్రటరీ బాలవెంకటేశకు ఎలక్ర్టి కల్‌ వీల్‌చైర్‌ కోసం మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహారెడ్డి, వికలాంగుల నెట్‌వర్క్‌ రాష్ట్ర అధ్యక్షుడు రఘునాథరెడ్డి లక్షరూ పాయలు వితరణగా అందించా రు.

దివ్యాంగ ఉద్యోగికి వీల్‌చైర్‌ కోసం  లక్ష రూపాయలు వితరణ
నగదు అందిస్తున్న కమిషనర్‌ నరసింహారెడ్డి

పులివెందుల రూరల్‌, డిసెంబరు 17: సచివాలయం వార్డు వెల్ఫేర్‌ సెక్రటరీ బాలవెంకటేశకు  ఎలక్ర్టి కల్‌ వీల్‌చైర్‌ కోసం మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహారెడ్డి, వికలాంగుల నెట్‌వర్క్‌ రాష్ట్ర అధ్యక్షుడు రఘునాథరెడ్డి లక్షరూ పాయలు వితరణగా అందించా రు. బయమ్మతోట సచివాలయం లో వార్డు వెల్ఫేర్‌ సెక్రటరీగా పనిచేస్తున్న బాలవెంకటేశ  దివ్యాంగుడైనా ఉత్తమ పనితీరు కనబరుస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. కొన్ని సందర్భాల్లో పనులు చేసేందుకు అనేక ఇబ్బందులు పడుతున్న ఆయనకు ఎలక్ర్టి కల్‌ వీల్‌చైర్‌ కోసం కలెక్టర్‌ హరికిరణ్‌, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, వైసీపీ నేత వైఎస్‌ మనోహర్‌రెడ్డి సహకారాలతో లక్షరూపాయల మొత్తాన్ని అందించామన్నారు.

Updated Date - 2020-12-18T05:08:18+05:30 IST