-
-
Home » Andhra Pradesh » Kadapa » nivar
-
నివర్ తుఫాన్పై అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2020-11-26T04:44:25+05:30 IST
రానున్న మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనల మేరకు నియోజకవర్గంలోని అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు.

ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు
రైల్వేకోడూరు, నవంబరు25 : రానున్న మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనల మేరకు నియోజకవర్గంలోని అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు. బుధవారం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెవెన్యూ, పంచాయతీ రాజ్, పోలీసు, వ్యవసాయ శాఖ సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయికెళ్లి ప్రజలను, రైతులను అప్రమత్తం చేయాలన్నారు. ఒక వేళ భారీ వర్షాలు పడితే చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. పండిన పంటలను రక్షించుకునేందుకు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో వైసీపీ సీనియర్ నాయకుడు రామిరెడ్డి ధ్వజారెడ్డి, రాష్ట్రవైసీపీ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల హేమనవర్మ, యువనాయకులు తోట శివసాయి పాల్గొన్నారు.