జిల్లా కాంగ్రెస్ కమిటీలో పలువురికి పదవులు
ABN , First Publish Date - 2020-11-14T05:25:51+05:30 IST
జిల్లా కాంగ్రెస్ కమిటీలో పలువురికి స్థానం కల్పించినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు
కడప(కలెక్టరేట్), నవంబరు 13: జిల్లా కాంగ్రెస్ కమిటీలో పలువురికి స్థానం కల్పించినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ఉపాధ్యక్షులుగా వేంపల్లెకు చెందిన డాక్టర్ సుబ్రమణ్యం, బద్వేల్కు చెందిన బుడిగి రామసుబ్బారెడ్డి, యర్రగుంట్లకు చెందిన సుబ్రమణ్యశర్మలను నియమించారు. ప్రధాన కార్యదర్శులుగా బొజ్జా తిరుమలేశు, గొర్రె ఓబయ్య, బీగాల రామకృష్ణ, కోశాధికారిగా కొవూరి శ్రీనివాసులు, కార్యదర్శులుగా సి.వెంకటసుబ్బారెడ్డి, మల్లికాబేగం, టి.శంకరయ్య, సాధిక్ అలీఖాన, అబ్దుల్ఖాన, బి.సుబ్బరాయుడులను నియమించినట్లు ఆయన తెలిపారు.
నగర కమిటీలో డివిజన ఇనచార్జులు వీరే ..
నగర కాంగ్రెస్ కమిటీ బలోపేతానికి డివిజన్ల వారీగా కాంగ్రెస్ పార్టీ ఇనచార్జులను నియమించినట్లు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు విష్ణుప్రీతంరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 1వ డివిజనకు మామిళ్ల నరసింహులు, 2కు డేరంగుల శివశంకర్, 3కు జి.సురేంద్రబాబు, 7కు సురేష్బాబు, 9కు కుళ్లాయప్ప, 14కు జార్జ్ లూయిస్, 15వ డివిజనకు నంద్యాల నాగేంద్ర, 16కు చెప్పలి పుల్లయ్య, 19కు అమీర్ బాషలతో పాటు 31వ డివిజనకు రంతుల్లాఖాన, 39కు జిలానీబాష, 47వ డివిజనకు ఫిరోజ్ రావులను నియమించినట్లు విష్ణుప్రీతంరెడ్డి ఆ ప్రకటనలో తెలిపారు.