ముగిసిన జాతీయ స్థాయి బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీలు

ABN , First Publish Date - 2020-03-16T10:28:44+05:30 IST

మూడు రోజులు గా మండలంలోని కోవరంగుట్టపల్లిలో జరుగుతున్న జాతీయస్థాయి బాల్‌బాడ్మిటన్‌ పోటీలు

ముగిసిన జాతీయ స్థాయి బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీలు

విజేతలుగా సదరన్‌ రైల్వే చెన్నై


సింహాద్రిపురం, మార్చి 15 : మూడు రోజులు గా మండలంలోని కోవరంగుట్టపల్లిలో జరుగుతున్న జాతీయస్థాయి బాల్‌బాడ్మిటన్‌ పోటీలు ఆదివారంతో ముగిశాయి.   ఈ సందర్భంగా ఆ ర్గనైజింగ్‌ కమిటీ చైర్మన్‌ శివారెడ్డి సమాచారం మేరకు సదరన్‌ రైల్వే చెన్నై  ప్రఽథమస్థానంలో నిలిచి 50 వేలు నగదు, షీల్డును వైసీపీ నేత శి వప్రకా్‌షరెడ్డి చేతుల మీదుగా తీసుకున్నారు.


ద్వితీయ స్థానంలో ఎస్‌ఆర్‌ఎం ఐఎ్‌సటీ చెన్నై, తృతీయ స్థానంలో  సౌత్‌ సెంట్రల్‌ రైల్యే సికింద్రాబాద్‌, నాల్గవ స్థానంలో టీవీమరదూర్‌ తం జావూర్‌ తమిళనాడు జట్లు నిలిచి 30 వేలు, 20 వేలు, 10 వేలు నగదు బహుమతి, షీల్డ్‌ను అందుకున్నాయి. ఈ సందర్భంగా కార్యక్రమం లో పలువురు  దాతలు, సహకరించిన వారందరికి శివారెడ్డి ధన్యవాదములు తెలిపారు.  

Updated Date - 2020-03-16T10:28:44+05:30 IST