నష్టపోయిన రైతులను ఆదుకుంటాం : ఎంపీ
ABN , First Publish Date - 2020-12-01T05:56:04+05:30 IST
తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి అన్నారు.

చక్రాయపేట, నవంబరు 30: తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన చక్రాయపేట మండలంలోని అద్దాలమర్రి, కుమార్లకాల్వ, సిద్దారెడ్డిగారిపల్లె గ్రామాలలో పంటలను పరిశీలిం చారు. స్థానికులు ఎంపీకి సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి తీసు కెళ్లి నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నష్టపరిహారం డిసెం బరు 31కల్లా అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఓఎస్డీ అనిల్ కుమార్రెడ్డి, ఏఓ నవంత్బాబు, శ్రీధర్రెడ్డి, శేషారెడ్డి, అద్దాలమర్రి మల్లికార్జునరెడ్డి, రామాంజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.