అర్హులందరికీ నేతన్న నేస్తం - ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2020-07-12T10:15:51+05:30 IST
నియోజకవర్గంలోని చేనేత గ్రామాల్లో అర్హత కలిగిన నేత కార్మికులందరికి నేతన్న నేస్తం పథకం గుర్తిస్తారని ఎమ్మెల్యే సుధీర్రెడ్డి పేర్కొన్నారు.
జమ్మలమడుగు రూరల్, జూలై 11: నియోజకవర్గంలోని చేనేత గ్రామాల్లో అర్హత కలిగిన నేత కార్మికులందరికి నేతన్న నేస్తం పథకం గుర్తిస్తారని ఎమ్మెల్యే సుధీర్రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఎమ్మెల్యే చేనేతలతో మాట్లాడుతూ అధికారులు వచ్చినప్పుడు నేత కార్మికులు నేత నేస్తుండాలన్నారు. కొత్త దరఖాస్తులకు ఇటీవల గ్రామ వలంటీర్లు జియోట్యాగ్ చేసినా నేతకార్మికులందరిని జిల్లా అధికారులు తనిఖీలు చేసి గుర్తిస్తారన్నారు. ఈ విషయమై చేనేత కార్మికులు మాట్లాడుతూ గతంలో ఎలాంటి తనిఖీలు లేకుండా నేతన్న నేస్తం అందించారని, అలాంటివారందరికి పథకంలో డబ్బులు పడ్డాయని, నిజంగా కొన్ని సంవత్సరాల నుంచి నేత నేస్తున్నవారికి పథకం రాలేదని తెలిపారు. కార్యక్రమంలో జమ్మలమడుగు, మైలవరం మండలాలకు చెందిన నేత కార్మికులు, మహిళలు పాల్గొన్నారు.