మధ్యాహ్న భోజన పథకం తనిఖీ

ABN , First Publish Date - 2020-12-02T04:52:29+05:30 IST

జగనన్న గోరుముద్ద కార్యక్రమం అమలు, పనితీరు తనిఖీల్లో భాగంగా మంగళవారం స్థానిక నందలూరు హైస్కూలును మధ్యాహ్న భోజన పథకం జిల్లా తనిఖీ అధికారి, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ షేక్‌ ఎజాజ్‌బాషా ఆకస్మికంగా తనిఖీ చేశారు.

మధ్యాహ్న భోజన పథకం తనిఖీ

నందలూరు, డిసెంబరు 1 : జగనన్న గోరుముద్ద కార్యక్రమం అమలు, పనితీరు తనిఖీల్లో భాగంగా మంగళవారం స్థానిక నందలూరు హైస్కూలును మధ్యాహ్న భోజన పథకం జిల్లా తనిఖీ అధికారి, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ షేక్‌ ఎజాజ్‌బాషా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులు, రిజిస్టర్‌లు పరిశీలించారు. కోవిడ్‌ సెలవుల్లో విద్యార్థులకు పంపిణీ చేసిన డ్రై రేషన్‌ వివరాలు సేకరించారు.  ఈ కార్యక్రమంలో డీఈవో కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ మహమ్మద్‌రఫీ,  హెచ్‌ఎం బి.రమాదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-02T04:52:29+05:30 IST