రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ABN , First Publish Date - 2020-11-03T10:51:26+05:30 IST

కడప-తాడిపత్రి రహదారిపై పందిళ్లపల్లె పెట్రోలు బంకు సమీపాన సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పసుపులేటి సాయిగణేష్‌ (39) మృతి చెందగా మరో వ్యక్తి గాయపడ్డాడు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

కమలాపురం, నవంబరు 2: కడప-తాడిపత్రి రహదారిపై పందిళ్లపల్లె పెట్రోలు బంకు సమీపాన సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పసుపులేటి సాయిగణేష్‌ (39) మృతి చెందగా మరో వ్యక్తి గాయపడ్డాడు. కమలాపురం పట్టణానికి చెందిన సాయిగణేష్‌ ఎర్రగుంట్ల సబ్‌స్టేషన్‌లో బిల్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. విధులు ముగించుకుని పట్టణానికి చెందిన శేషయ్యతో కలిసి ద్విచక్ర వాహనంలో వస్తుండగా వెనుకవైపు నుంచి వచ్చిన ట్రాక్టర్‌ ఢీకొంది. ఈ సంఘటనలో తీవ్రగాయాలపాలైన సాయిగణేష్‌ అక్కడికక్కడే మృతిచెందగా శేషయ్యకు తీవ్ర గాయాల య్యాయి. అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పతికి తరలించారు. సాయిగణే్‌షకు వివాహమై ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజారెడ్డి తెలిపారు. 

Updated Date - 2020-11-03T10:51:26+05:30 IST