ఒక్క అవకాశమివ్వండి అని చెప్పి వంచిస్తారా..?
ABN , First Publish Date - 2020-10-29T09:24:11+05:30 IST
ఎన్నికల ముందు తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరిన జగన్ ఇప్పుడు ఆ ప్రజలనే వంచిస్తున్నారని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు ఆర్.
టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి
సుండుపల్లె, అక్టోబర్ 28: ఎన్నికల ముందు తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరిన జగన్ ఇప్పుడు ఆ ప్రజలనే వంచిస్తున్నారని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు ఆర్. శ్రీనివాసరెడ్డి ఽధ్వజమెత్తారు. బుధవారం సుండుపల్లె మం డల కేంద్రంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్, రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బత్యాల చంగల్రాయులుతో కలిసి స్థానిక ఓ కళ్యాణమండపంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం సామాన్యులపై కూడా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని, సుండుపల్లెలో అధికారులు అధికారపార్టీకి మద్దతు పలుకుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వైసీసీ నాయకులు ఎర్రచందనం, ఇసుక, రేషన్ బియ్యం అమ్ముకుని సొమ్ముచేసుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజంపేట ఎంపీ, ఎమ్మెల్యేల అరాచకాలకు అడ్డుకట్ట వేస్తామన్నారు. ప్రస్తుతం మండల పరిధిలో పలు చోట్ల వాగులు, ఏటి పొరంబోకులు, చెరువులను కొందరు వైసీపీ నాయకులు ఆక్రమించి కోట్ల రూపాయ లు సంపాదించుకుంటున్నారని ఆయన ఆరోపించారు.