రామనపల్లె వంకలో యువకుడి గల్లంతు
ABN , First Publish Date - 2020-09-27T12:34:56+05:30 IST
మండలంలోని రామనపల్లె నుంచి వ్యవసాయ పొలాల గుండా చెన్నూరుకు వచ్చే దారిలో ఉన్న ఉప్పువంకలో బీహార్కు చెందిన జీవన్ (25) అనే ఏళ్ల యువకుడు గల్లంతయ్యాడు.
చెన్నూరు, సెప్టెంబరు 26: మండలంలోని రామనపల్లె నుంచి వ్యవసాయ పొలాల గుండా చెన్నూరుకు వచ్చే దారిలో ఉన్న ఉప్పువంకలో బీహార్కు చెందిన జీవన్ (25) అనే ఏళ్ల యువకుడు గల్లంతయ్యాడు. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు... శనివారం సాయంత్రం జీవన్ ద్విచక్ర వాహనంలో ముండ్లపల్లె నుంచి రామనపల్లెమీదుగా చెన్నూరుకు చికెన్ కోసం వస్తున్నాడు.
అప్పటికే ఉప్పువంకపై ఉన్న కల్వర్టుపై నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. అయినప్పటికీ వంక దాటే ప్రయత్నం చేశాడు. అయితే నీటి ఉధృతికి ద్విచక్ర వాహనంతో పాటు ఆ యువకుడు కొట్టుకుపోయినట్లు ఆ గ్రామ ప్రజలు చెబుతున్నారు. గల్లంతైన జీవన్ కోసం ఎస్ఐ తులసి నాగప్రసాద్, పోలీసు సిబ్బంది వంక పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం దక్కలేదు