గౌడ కులస్థుల అభ్యున్నతికి కృషి

ABN , First Publish Date - 2020-12-28T05:13:45+05:30 IST

గౌడ కులస్థుల అభ్యన్నతికి కృషి చేస్తానని రాష్ట్ర ఈడిగ సంక్షేమ సంఘం డైరెక్టర్‌ దాసరి చిదానందగౌడ్‌ పేర్కొన్నారు.

గౌడ కులస్థుల అభ్యున్నతికి కృషి
చిదానందగౌడ్‌ను సన్మానం చేస్తున్న గౌడ సంఘం నాయకులు

ఈడిగ సంక్షేమ సంఘ డైరెక్టర్‌ దాసరి చిదానందగౌడ్‌

ముద్దనూరు డిసెంబరు27:గౌడ కులస్థుల అభ్యన్నతికి కృషి చేస్తానని రాష్ట్ర ఈడిగ సంక్షేమ సంఘం డైరెక్టర్‌ దాసరి చిదానందగౌడ్‌ పేర్కొన్నారు. మండల పరిధిలోని పెనికెలపాడు గ్రామంలోని  డీసీసీ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ కాటమయ్య గౌడ్‌ స్వగృహంలో ఆదివారం గౌడ కులస్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రభుత్వం నుంచి గౌడలకు అందాల్సిన సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తానన్నారు. ముఖ్యం గా కల్లుగీత కార్మికులకు అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్‌ అందేలా చూస్తామన్నారు. అనంతరం చిదనందగౌడ్‌కు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఈడిగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మురళీగౌడ్‌,  ప్రధాన కార్యదర్శి కొండయ్య గౌడ్‌, ఉపాధ్యక్షులు కొడతాల వరప్రసాద్‌గౌడ్‌, గౌడ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రామ్మోహనగౌడ్‌ , గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-28T05:13:45+05:30 IST