మున్సిపల్ కార్మికులకు హెల్త్ అలవెన్స్లు ఇవ్వాలి
ABN , First Publish Date - 2020-12-04T04:33:10+05:30 IST
మున్సిపల్ కార్మికులకు ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న హెల్త్ అలవెన్స్లు వెంటనే ఇవ్వాలని సీఐటీయూ, ఏఐటీయూసీ అధ్యక్షుడు మద్దెల చెన్నయ్య, హరి డిమాండ్ చేశారు.

రాయచోటిటౌన్, డిసెంబరు3: మున్సిపల్ కార్మికులకు ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న హెల్త్ అలవెన్స్లు వెంటనే ఇవ్వాలని సీఐటీయూ, ఏఐటీయూసీ అధ్యక్షుడు మద్దెల చెన్నయ్య, హరి డిమాండ్ చేశారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులను పర్మినెంట్ చేస్తామని నాడు పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. అలాగే సచివాలయాలకు మున్సిప్ కార్మికులను అనుసంధానం చేయకూడదన్నారు. గత 5 నెలలుగా పెండింగ్లో ఉన్న హెల్త్ అలవెన్స్లు ఒక్కొక్కరికి రూ.30 వేలు చొప్పున వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతినెలా 5వ తేదీలోపు జీతాలు ఇవ్వకుండా కమిషనర్ జాప్యం చేయడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులు రాంబాబు, తిరుపతమ్మ, రమణమ్మ, సిద్దయ్య, వెంకట్రమణ తదితరులు పాల్గొన్నారు.