రూ.2 లక్షల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
ABN , First Publish Date - 2020-08-12T05:30:00+05:30 IST
కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.2,20,500 విలువైన గుట్కా ప్యాకెట్లను బుధవారం స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వాసు
నిందితుడి అరెస్టు
పులివెందుల టౌన్, ఆగస్టు 12: కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.2,20,500 విలువైన గుట్కా ప్యాకెట్లను బుధవారం స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వాసుదేవన్ తెలిపారు. ముందస్తు సమాచారంతో తాము కనంపల్లె చెక్ పోస్టు వద్ద తనిఖీ చేశామన్నారు. తనిఖీల్లో కమలాపురం మండలానికి చెందిన బెల్లం భాస్కర్ అనే వ్యక్తి పాలట్యాంకులో చిక్బల్లాపూర్ నుంచి అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లు, 10 మద్యం బాటిళ్లు దొరికాయన్నారు. ఈ మేరకు వాటిని స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేసి అతడిని అరెస్టు చేశామన్నారు. సీఐ భాస్కర్రెడ్డి, ఎస్ఐ గోపినాథ్రెడ్డి, పోలీసులు పాల్గొన్నారు.