అదే ఉధృతి.. కరోనాతో మరో ఐదుగురు మృతి
ABN , First Publish Date - 2020-07-23T17:37:10+05:30 IST
జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఒకపక్క భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుంటే మరోపక్క మరణాల సంఖ్య కూడా ఆందోళన రేకెత్తిస్తోంది. కరోనా మహమ్మారితో మరో ఐదుమంది మృతి చెందినట్లు
229 పాజిటివ్ కేసులు నమోదు
78 మంది డిశ్చార్జి
(కడప - ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఒకపక్క భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుంటే మరోపక్క మరణాల సంఖ్య కూడా ఆందోళన రేకెత్తిస్తోంది. కరోనా మహమ్మారితో మరో ఐదుమంది మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ప్రకటించింది. మృతుల సంఖ ్య 66కు చేరుకున్నట్లు వెల్లడించింది. కొత్తగా 229 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 3610కి చేరుకుంది. డిస్ట్రిక్ట్ కోవిడ్ ఆసుపత్రి ఫాతిమా, రిమ్స్, కోవిడ్ కేర్ సెంటరులో చికిత్స పొందుతున్న 78 మందిని డిశ్చార్జి చేసినట్లు కలెక్టరు వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు 1733 మంది సంపూర్ణంగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
కోవిడ్-19 సమాచారం
మొత్తం శాంపిల్స్ - 108557
రిజల్ట్ వచ్చినవి - 99951
నెగటివ్ - 96341
పాజిటివ్ - 3610
డిశ్చార్జ్ అయినవారు - 1733
రిజల్ట్ రావాల్సినవి - 8606
జూలై 22వ తేదీ తీసిన శాంపిల్స్ - 2379