14 నుంచి పాఠశాలల్లో ఫిట్ ఇండియా కార్యక్రమం
ABN , First Publish Date - 2020-12-06T05:10:54+05:30 IST
జిల్లాలో అన్ని యాజమాన్య పాఠశాలల్లో ఈ నెల 14 నుంచి కలెక్టరు ఆదేశాల మేరకు ఫిట్ ఇండియా కార్యకమ్రాలు నిర్వహించాలని జిల్లా విద్యాశాకాధికారి పి.శైలజ తెలిపారు.
కడప(ఎడ్యుకేషన్), డిసెంబరు 5: జిల్లాలో అన్ని యాజమాన్య పాఠశాలల్లో ఈ నెల 14 నుంచి కలెక్టరు ఆదేశాల మేరకు ఫిట్ ఇండియా కార్యకమ్రాలు నిర్వహించాలని జిల్లా విద్యాశాకాధికారి పి.శైలజ తెలిపారు. వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రల చేత ఈ కార్యకమ్రం నిర్వహించాలన్నారు. అలాగే ప్రతి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సహకారం తీసుకోవాలన్నారు. ఫిట్ ఇండియా లింకు ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకుని ఫిట్ ఇండియా యాప్లో అప్లోడ్ చేయాలన్నారు.