జిల్లాలో ముగ్గురు డీఎస్పీలకు పోస్టింగ్లు ?
ABN , First Publish Date - 2020-12-12T05:20:18+05:30 IST
జిల్లాలో పలు స్టేషన్లలో ఖాళీగా ఉన్న స్థానాలకు ముగ్గురు డీఎస్పీలను కేటాయిస్తూ రాష్ట్ర పోలీసుశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
కడప(క్రైం), డిసెంబరు 11: జిల్లాలో పలు స్టేషన్లలో ఖాళీగా ఉన్న స్థానాలకు ముగ్గురు డీఎస్పీలను కేటాయిస్తూ రాష్ట్ర పోలీసుశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. కడప ట్రాఫిక్ డీఎస్పీగా శ్రీనివాసులరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా వెంకటశివారెడ్డి, డీటీసీ డీఎస్పీగా రమణకుమార్లకు పోస్టింగులు ఇచ్చినట్లు తెలుస్తోంది. నేడో, రేపో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనున్నారు. కడప ట్రాఫిక్, డీటీసీ, ఎస్బీ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఈ మేరకు వారికి పోస్టింగులు కల్పించారు.