ఇంటి నుంచి రాకండి...కరోనా బారిన పడకండి
ABN , First Publish Date - 2020-03-29T10:20:48+05:30 IST
ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా ఉంటే కరోనా వైరస్ బారిన పడరని రైల్వేకోడూరు పోలీసులు శనివారం ముమ్మరంగా
రైల్వేకోడూరు, మార్చి, 28: ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా ఉంటే కరోనా వైరస్ బారిన పడరని రైల్వేకోడూరు పోలీసులు శనివారం ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. రైల్వేకోడూరు పట్టణమే కాకుండా గ్రావీణ ప్రాంతాల్లో ప్రజలు తమ గ్రామాల్లోకి ఇతరులు ఎవరు రాకుండా ఉండాలని కంచెలు వేసుకున్నారు. అత్యవసరాలను మాత్రమే పోలీసులు అనుమతించారు. రైల్వేకోడూరు శిక్షణ డీఎ్సపీ వరప్రసాద్రావు, సీఐ ఆవుల ఆనందరావు, ఈవీవీ నరసింహం లు రైల్వేకోడూరు మండలంలో పరిస్థితిని పర్యవేక్షించారు. పోలీసులకు రైల్వేకోడూరుకు చెందిన ప్రముఖ న్యాయవాది ఆర్సీ సురే్షబాబు, రాఘవరాజపురం కు చెందిన ముద్దపోలు సుబ్బరాయుడు కుమారులు 150 మంది పేదలు, పోలీసులకు భోజనాలు అందించారు.
బీజేపీ మండల అధ్యక్షుడు, మాజీ సైనికుడు కారుమంచి వెంకటసుబ్బయ్య, బీజేపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా ఉపాధ్యక్షుడు ఎస్ఏ సలాం, రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు తోట శ్రీనివాసులు, నాయకుల ఆధ్వర్యం లో పేదలకు భోజనాలు అందించారు. యువకులు తదితరులు మజ్జిగ పంపిణీ చేశారు. అలాగే రజిక సేవా సమితి కువైత్ చెన్నూరు సుబ్రమహ్మణ్యం, పేరూరు రామక్రిష్ణ ఆధ్వర్యంలో 100 మందికి జనసేన నాయకులు ముత్యాల కిశోర్, మహిళానాయకురాలు కుప్పాలజ్యోతి పేదలకు భోజనాలు అందించారు. జిల్లా సరిహద్దుల్లో పోలీసులు వాహనాలు రాకుండా కట్టడి చేయించారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చికెన్, మటన్, కూరగాయలు, ప్రొవిజన్ స్టోర్లకు కాల పరిమితి ఇచ్చారు. కూర