అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు : డిప్యూటీ సీఎం
ABN , First Publish Date - 2020-09-13T08:19:59+05:30 IST
అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు : డిప్యూటీ సీఎం
కడప(ఎర్రముక్కపల్లె), సెప్టెంబరు 12: అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి అంజద్బాషా పేర్కొన్నారు. శనివారం అంబేడ్కర్ భవన్, గాంధీనగర్ మున్సిపల్ హైస్కూలులో వైఎ్సఆర్ ఆసరా వారోత్సవాల్లో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రజల ప్రభుత్వమని, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రజ లు సుభిక్షంగా ఉండాలని తపన పడుతున్నారన్నారు. కమిషనరు లవన్న, మెప్మా పీడీ రామ్మోహన్రెడ్డి, మెప్మా అధికారులు, వైసీపీ నేతలు సుభాన్బాషా, వెంకటసుబ్బయ్య, అజ్మతుల్లా, మనోజ్కుమార్ పాల్గొన్నారు. రాబోయే నాలుగేళ్లలో నగరాన్ని సుందరవనంగా తీర్చిదిద్దనున్నామని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మరాఠివీఽధిలో ఆయనతో మాజీ మేయరు సురే్షబాబు సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. వైసీపీ నేతలు మాసీమబాబు, బాలస్వామిరెడ్డి, చిట్టిబాబు, ఆల్ఫోన్స్, రాజా, మధు పాల్గొన్నారు.