చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2020-12-04T04:44:31+05:30 IST
కడప నగరం రవీంద్రనగర్కు చెందిన ఓ వ్యక్తి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తాలుకా సీఐ నాగభూషణం తెలిపారు.

కడప (క్రైం), డిసెంబరు 3: కడప నగరం రవీంద్రనగర్కు చెందిన ఓ వ్యక్తి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తాలుకా సీఐ నాగభూషణం తెలిపారు. సీఐ వివరాల మేరకు రవీంద్రనగర్కు చెందిన షేక్ మహమ్మద్ మునీర్బాషా (32) గత నెల 26న తెల్లవారుజామున సిలిండరు పేలి మునీర్ బాషాతో పాటు అతని భార్య షేక్ కరీం గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వీరిని కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్కు తరలించి ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.