కరోనా అదే దూకుడు
ABN , First Publish Date - 2020-08-07T05:30:00+05:30 IST
జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి కళ్లెం పడలేదు. లాక్డౌన్ విధించినా వైరస్ వేగంగానే విస్తరిస్తోంది.
604 పాజిటివ్ కేసులు
ముగ్గురు మృతి
కడప, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి కళ్లెం పడలేదు. లాక్డౌన్ విధించినా వైరస్ వేగంగానే విస్తరిస్తోంది. 24 గంటల వ్యవధిలో 604 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 11,678 చేరుకుంది. కరోనాతో ముగ్గురు మృతి చెందినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 124 మంది మృత్యువాత పడ్డారు. రిమ్స్, ఫాతిమా ఆసుపత్రి కొవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొంది కోలుకున్న 279 మందిని డిశ్చార్జి చేశారు. దీంతో మొత్తం 5349 మంది కరోనాను జయించి బయటపడ్డారు.