భక్తి భావంతోనే సమాజంలో మార్పు
ABN , First Publish Date - 2020-12-31T05:06:22+05:30 IST
భక్తిభావంతో మనిషితో పాటు సమాజంలో కూడా మార్పు వస్తుందని జూనియర్ సివిల్ జడ్జి హారిక పేర్కొన్నారు.

జూనియర్ సివిల్ జడ్జి హారిక
రాయచోటిటౌన్, డిసెంబరు30: భక్తిభావంతో మనిషితో పాటు సమాజంలో కూడా మార్పు వస్తుందని జూనియర్ సివిల్ జడ్జి హారిక పేర్కొన్నారు. పౌర్ణమి సందర్భంగా బుధవారం పట్టణంలోని ఎస్ఎన్కాలనీలో ఉన్న షిరిడిసాయిబాబా మందిరంలో సత్యనారాయణ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి హారిక షిరిడిసాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బయారెడ్డి, కోశాధికారి కొప్పల గంగిరెడ్డి, సభ్యులు రతీంద్రారెడ్డి, సుధాకర్ జడ్జికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం వ్రతంలో పాల్గొన్నవారికి అన్నదానం చేశారు.