ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల
ABN , First Publish Date - 2020-09-26T06:56:15+05:30 IST
ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ ఐసెట్)-2020 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి.
జిల్లాలో 71 శాతం ఉత్తీర్ణత
కడప (ఎడ్యుకేషన్), సెప్టెంబరు 25: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ ఐసెట్)-2020 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. జిల్లాలో 71 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
ఈ పరీక్షలకు జిల్లా నుంచి 3484 మంది విద్యార్థులు హాజరు కాగా, 2498 మంది (71 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 986 మంది ఫెయిల్ అయ్యారు. ఉత్తీర్ణత సాధించిన వారిలో 1437 మంది అబ్బాయిలు, 1061 మంది అమ్మాయిలు ఉన్నారు.