కేసుల్లో పురోగతి సాధించాలి

ABN , First Publish Date - 2020-12-02T04:58:13+05:30 IST

కేసుల్లో పురోగతి సాధించాలని రాజంపేట డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి తెలిపారు.

కేసుల్లో పురోగతి సాధించాలి
రైల్వేకోడూరు సీఐ కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేస్తున్న డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి

రాజంపేట డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి

రైల్వేకోడూరు రూరల్‌, డిసెంబరు 1: కేసుల్లో పురోగతి సాధించాలని రాజంపేట డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి తెలిపారు. రైల్వేకోడూరు సీఐ కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసుల్లో ఉన్న నిందితులు పరారీలో ఉంటే వారిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రికార్డులు సక్రమంగా ఉండాలన్నారు. పోలీసులు విధులు సక్రమంగా చేయాలన్నారు. ప్రధానంగా ఎర్రచందనం అక్రమ రవాణా జరగకుండా ఉండేందుకు ముమ్మరంగా తనిఖీలు చేయాలన్నారు. కేసుల్లో తప్పించుకుని తిరుగుతున్న స్మగ్లర్లను పట్టుకునేందుకు నిఘాలు ఉన్నాయని తెలిపారు. ట్రాఫిక్‌ నియంత్రణలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పలు కేసులకు సంబధించిన రికార్డులు పరిశీలించి సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐ ఆవుల ఆనందరావు, ఎస్‌ఐలు పెద్దఓబన్న, రెడ్డి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-02T04:58:13+05:30 IST