జేఎన్టీయూ బీటెక్‌ ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2020-12-11T04:56:59+05:30 IST

పులివెం దుల జేఎన్టీయూ కళాశాల బీటెక్‌ ఫలితాలు విడుదల చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ జీఎస్‌ ఎస్‌ రాజు తెలిపారు.

జేఎన్టీయూ బీటెక్‌ ఫలితాలు విడుదల
ఫలితాలను విడుదల చేస్తున్న ప్రిన్సిపాల్‌, విభాగాధిపతులుస

పులివెందుల రూరల్‌, డిసెంబరు 10: పులివెం దుల జేఎన్టీయూ కళాశాల బీటెక్‌ ఫలితాలు విడుదల చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ జీఎస్‌  ఎస్‌ రాజు తెలిపారు. గురువారం పరీక్ష ఫలితా లు విడుదల చేసిన అనంతరం ఆయన మా ట్లాడుతూ మూడో సంవత్సరం రెండో సెమిస్టర్‌ (ఆర్‌ 15, ఆర్‌13) రెగ్యులర్‌, సప్లమెంటరీ, నాల్గో సంవత్సరం రెండో సెమిస్టరు (ఆర్‌ 15) అడ్వాన్సడ్‌ సప్లమెంటరీ పరీక్ష పలితాలు విడుదల చేశామన్నారు. ఈ ఫలితాల్లో 307 మంది విద్యార్థులు హాజరవగా 248 మంది ఉత్తీర్ణత సాధించారన్నా రు. పరీక్ష ఫలితాలను కళాశాల వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు. సమావేశానికి వైస్‌ ప్రిన్సిపాల్‌ జివి సుబ్బారెడ్డి, పరీక్ష కేంద్ర విభాగాధిపతులు, వివిధ డిపార్ట్‌మెంట్‌ అధిపతులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-11T04:56:59+05:30 IST