ఆటో-స్కూటర్‌ ఢీ... యువకుడి మృతి

ABN , First Publish Date - 2020-12-12T05:09:19+05:30 IST

రాజంపేట పట్టణం బైపాసు సమీపం లోని ఓ కల్యాణ మండపం వద్ద శుక్రవారం రాత్రి ఆటో-స్కూటర్‌ ఢీకొ న్న సంఘటనలో అశోక్‌కుమార్‌ (15) అనే యువకుడు మృతి చెందాడు.

ఆటో-స్కూటర్‌ ఢీ... యువకుడి మృతి
అశోక్‌కుమార్‌ మృతదేహం

రాజంపేట టౌన్‌, డిసెంబరు 11: రాజంపేట పట్టణం బైపాసు సమీపం లోని ఓ కల్యాణ మండపం వద్ద శుక్రవారం రాత్రి ఆటో-స్కూటర్‌ ఢీకొ న్న సంఘటనలో అశోక్‌కుమార్‌ (15) అనే యువకుడు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో రామ్‌నగర్‌కు చెందిన రాజశేఖర్‌ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో కడప రిమ్స్‌కు తరలించి నట్లు పట్టణ ఎస్‌ఐ రామాంజనే యులు తెలిపారు. నందలూరు మం డలం నాగి రెడ్డిపల్లెకు చెందిన అశోక్‌కుమార్‌ ఆటోలో భువనగిరిపల్లె వద్ద ఉన్న అరటికా యల మండీకి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2020-12-12T05:09:19+05:30 IST