టిప్పర్ దొంగలు అరెస్టు
ABN , First Publish Date - 2020-11-07T06:33:35+05:30 IST
కలమల్ల పోలీసుస్టేషన పరిధిలో 4వ తేదీన చోరీకి గురైన టిప్పర్ను శుక్రవారం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఉలసయ్య, ఎస్ఐ చంద్రమోహనలు తెలిపారు.
![టిప్పర్ దొంగలు అరెస్టు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఎర్రగుంట్ల, నవంబరు 6: కలమల్ల పోలీసుస్టేషన పరిధిలో 4వ తేదీన చోరీకి గురైన టిప్పర్ను శుక్రవారం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఉలసయ్య, ఎస్ఐ చంద్రమోహనలు తెలిపారు. శుక్రవారం కొండాపురం మండలంలోని వెంకటాపురం గ్రామం సమీపంలోని హైవే నందు ఈ టిప్పర్ను స్వాధీనం చేసుకుని కలమల్లకు చెందిన షేక్ ఖాదర్బాషా, పులివెందులకు చెందిన పాండురంగనాయకులను అరెస్టుచేసినట్లు పేర్కొన్నారు. నిందితులను కొర్టుకు హాజరు పరచినట్లు పేర్కొన్నారు. టిప్పర్ను పట్టుకోవడంలో కలమల్ల ఏఎస్ఐ మగ్బుల్, హెడ్కానిస్టేబుల్ రమణారెడ్డి, వేణుగోపాల్రెడ్డి, శ్రీకాంత, నాథానియల్ తదితరులు
పాల్గొన్నారు.