వ్యవసాయ బోర్లకు దరఖాస్తు చేసుకోవాలి

ABN , First Publish Date - 2020-07-11T10:00:04+05:30 IST

జిల్లాలోని అర్హులైన ఎస్సీలందరూ సంబంధిత గ్రామ సచివాలయాల్లో వ్యవసాయ బోర్లకు దరఖాస్తులు చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ

వ్యవసాయ బోర్లకు దరఖాస్తు చేసుకోవాలి

ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ వెంకటసుబ్బయ్య


కడప (నాగరాజుపేట), జూలై 10: జిల్లాలోని అర్హులైన ఎస్సీలందరూ సంబంధిత గ్రామ సచివాలయాల్లో వ్యవసాయ బోర్లకు దరఖాస్తులు చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ డాక్టర్‌ హనుమంతు వెంకటసుబ్బయ్య తెలిపారు. రెండున్నర ఎకరాల నుంచి ఐదెకరాల లోపు వరకు ఉన్న రైతులు అర్హులని, లేని పక్షంలో భాగస్వామ్యంతో పక్క భూమి ఉన్న రైతులతో కలిపి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. భూగర్భ జల పరిశోధన అధికారుల నివేదికతో సదరు బోర్లు మంజూరవుతాయన్నారు.

Updated Date - 2020-07-11T10:00:04+05:30 IST