ఉదయం 11 వరకే అనుమతి
ABN , First Publish Date - 2020-07-27T10:37:35+05:30 IST
నగరంలో రోజురోజుకూ కరోనా కేసులు తీవ్రమవుతున్న నేపథ్యంలో సోమవారం నుంచి నగరంలోని అన్ని రకాల దుకాణాలు

కడప డీఎస్పీ సూర్యనారాయణ
కడప (క్రైం), జూలై 26: నగరంలో రోజురోజుకూ కరోనా కేసులు తీవ్రమవుతున్న నేపథ్యంలో సోమవారం నుంచి నగరంలోని అన్ని రకాల దుకాణాలు, మాల్స్, హోటల్స్, ఫంక్షన్ హాల్స్లకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకే అనుమతి అని కడప డీఎస్పీ సూర్యనారాయణ ప్రకటనలో పేర్కొన్నారు. అనవసరంగా ప్రజలెవరూ బయటికి రావద్దని హెచ్చరించారు. ప్రజలు తమకు కావాల్సిన నిత్యావసర వస్తువులను 11 గంటల లోపే కొనుగోలు చేయాలని సూచించారు. బయటికి వచ్చేటప్పుడు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని తెలిపారు. ప్రజలు పోలీసు అధికారుల సూచనలు పాటించి సహకరించాలని కోరారు.