ఆక్రమితభూమి గుర్తింపు
ABN , First Publish Date - 2020-11-08T05:07:36+05:30 IST
ఓబులవారిపల్లె మండలం బోటుమీదపల్లెలో ఆక్రమించిన ప్రభుత్వ భూమి గుర్తించినట్లు తహసీల్దారు వెంకటసుబ్బయ్య తెలిపారు.
![ఆక్రమితభూమి గుర్తింపు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఓబులవారిపల్లె, నవంబరు7 : ఓబులవారిపల్లె మండలం బోటుమీదపల్లెలో ఆక్రమించిన ప్రభుత్వ భూమి గుర్తించినట్లు తహసీల్దారు వెంకటసుబ్బయ్య తెలిపారు. ఆక్రమిత ప్రభుత్వ భూముల గుర్తింపులో భాగంగా బోటుమీదపల్లెలో శనివారం తహసీల్దారు బృందం పర్యటించారు. సర్వేనెంబరు 292లో 5.50ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణను గుర్తించి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశా రు. కార్యక్రమంలో ఆర్ఐ రామ్మోహన, వీఆర్వో పాల్గొన్నారు.