996 పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-09-03T11:20:18+05:30 IST
జిల్లాలో కరోనా వైరస్ జెట్ స్పీడ్లో వ్యాప్తి చెందుతోంది. కొత్తగా 996 మందిలో వైరస్ నిర్ధారణ అయినట్లు వైద్య

28,294 చేరిన బాధితుల సంఖ్య
ఇద్దరు మృతి
కడప, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్ జెట్ స్పీడ్లో వ్యాప్తి చెందుతోంది. కొత్తగా 996 మందిలో వైరస్ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖాధికారులు బుధవారం ప్రకటించారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 28,294కు చేరుకున్నాయి. 24 గంటల వ్యవధిలో మరో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకూ 298 మంది మృతి చెందారు. ఇప్పటివరకు జిల్లాలో 2,64,063 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. బుధవారం 6185 మంది నుంచి నమూనాలను సేకరించారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 591 మందిని బుధవారం డిశ్చార్జి చేశారు. ఇప్పటి వరకు 20,204 మంది చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. హోం ఐసోలేషన్లో 5855 మంది చికిత్స పొందుతున్నారు.