కడప జిల్లాలో 55కు చేరిన కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-04-26T01:30:14+05:30 IST
కడప జిల్లాలో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

కడప : కడప జిల్లాలో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇవాళ మరో నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నేడు నమోదైన నాలుగు కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 55కు చేరుకుంది. ఇవాళ్టి నాలుగు కేసుల్లో ప్రొద్దుటూరులో మూడు, ఎర్రగుంట్లలో ఒక కేసు నమోదైంది. కాగా ఇవాళ ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 4,820 శాంపిల్స్ను సేకరించి కరోనా టెస్ట్ చేయడం జరిగిందని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది.
రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఇదీ..
రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 61 కేసులు పాజిటివ్గా నమోదయ్యాయి. రాష్ట్రంలోని నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1016. ఇప్పటి వరకూ 171 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 814 అని వైద్య ఆరోగ్య శాఖ మీడియా బులెటిన్లో తెలిపింది.
జిల్లాల వారీగా కేసుల లెక్కలు ఇవీ..
