కువైత్ నుంచి 156 మంది రాక.. క్వారంటైన్ కు తరలింపు..
ABN , First Publish Date - 2020-06-29T23:20:26+05:30 IST
కువైత్ నుంచి జిల్లావాసులు 156 మంది ఆదివారం ఉదయం రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలకు చేరుకున్నారు.
130 మంది రాజంపేట అన్నమాచార్యకు
26 మంది మహిళలు ఉద్యానవన కళాశాలకు తరలింపు
రాజంపేట (కడప) : కువైత్ నుంచి జిల్లావాసులు 156 మంది ఆదివారం ఉదయం రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలకు చేరుకున్నారు. ఇందులో 26 మంది మహిళలు ఉండగా వారిని అనంతరాజుపేట ఉద్యానవన కళాశాలకు తరలించారు. కువైత్ నుంచి వచ్చిన వారిలో కొందరు హైదరాబాదు నుంచి, మరికొందరు చెన్నై విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్సుల్లో ఆదివారం ఉదయం రాజంపేట అన్నమాచార్యకు చేరుకున్నారు. వీరికి రాజంపేట రెవెన్యూ, వైద్య, పోలీసు సిబ్బంది స్వాగతించి వారికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. వీరందరికీ రేపటి నుంచి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని తహసీల్దారు రవిశంకర్రెడ్డి తెలిపారు.