అమ్మఒడి పథకాన్ని వర్పింపజేయాలి

ABN , First Publish Date - 2020-12-29T06:21:38+05:30 IST

ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులకు అమ్మఒడి పథకం వర్తింపజేయాలని ఇంజనీరింగ్‌, టౌన్‌ ప్లానింగ్‌ వర్కర్స్‌ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు ఈదులమూడి మధుబాబు డిమాండ్‌ చేశారు.

అమ్మఒడి పథకాన్ని వర్పింపజేయాలి
ధర్నా చేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులు

ఇంజనీరింగ్‌,  టౌన్‌ ప్లానింగ్‌ వర్కర్స్‌ ట్రేడ్‌ యూనియన్‌ ధర్నా

గుంటూరు(కార్పొరేషన్‌), డిసెంబరు28: ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులకు అమ్మఒడి పథకం వర్తింపజేయాలని ఇంజనీరింగ్‌,  టౌన్‌ ప్లానింగ్‌ వర్కర్స్‌ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు ఈదులమూడి మధుబాబు డిమాండ్‌ చేశారు.  నగరపాలక సంస్థ ఆవరణలో సోమవారం ఇంజనీరింగ్‌ - టౌన్‌ ప్లానింగ్‌, శానిటేషన్‌ వర్కర్స్‌ ట్రేడ్‌ యూనియన్‌ ధర్నా నిర్వహించారు. ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులకు అమ్మఒడి వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులకు ఈ ప్రభుత్వ పథకం వర్తించదని చెబుతున్నారని తెలిపారు. అనంతరం కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాయపూడి కోటిబాబు,  నాగిపోగు సుమన్‌, నల్గొండ జయరామ్‌ు, కార్మికులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-29T06:21:38+05:30 IST