అమ్మఒడి పథకాన్ని వర్పింపజేయాలి
ABN , First Publish Date - 2020-12-29T06:21:38+05:30 IST
ఔట్ సోర్సింగ్ కార్మికులకు అమ్మఒడి పథకం వర్తింపజేయాలని ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు ఈదులమూడి మధుబాబు డిమాండ్ చేశారు.
ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ధర్నా
గుంటూరు(కార్పొరేషన్), డిసెంబరు28: ఔట్ సోర్సింగ్ కార్మికులకు అమ్మఒడి పథకం వర్తింపజేయాలని ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు ఈదులమూడి మధుబాబు డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ ఆవరణలో సోమవారం ఇంజనీరింగ్ - టౌన్ ప్లానింగ్, శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ధర్నా నిర్వహించారు. ఔట్ సోర్సింగ్ కార్మికులకు అమ్మఒడి వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు ఔట్ సోర్సింగ్ కార్మికులకు ఈ ప్రభుత్వ పథకం వర్తించదని చెబుతున్నారని తెలిపారు. అనంతరం కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాయపూడి కోటిబాబు, నాగిపోగు సుమన్, నల్గొండ జయరామ్ు, కార్మికులు పాల్గొన్నారు.