మోదీ ఏడాది పాలనలో అభివృద్ధి అమోఘం

ABN , First Publish Date - 2020-06-18T09:58:58+05:30 IST

దేశంలో ప్రధాని నరేంద్రమోదీ ఏడాది పాలనలో చారిత్రాత్మకమైన అభివృద్ధి జరిగిందని టుబాకో బోర్డు చైర్మన్‌ యడ్లపాటి

మోదీ ఏడాది పాలనలో అభివృద్ధి అమోఘం

టుబాకో బోర్డు చైర్మన్‌ రఘునాధబాబు


బాపట్ల టౌన్‌, జూన్‌ 17: దేశంలో ప్రధాని నరేంద్రమోదీ ఏడాది పాలనలో చారిత్రాత్మకమైన అభివృద్ధి జరిగిందని టుబాకో బోర్డు చైర్మన్‌ యడ్లపాటి రఘునాధబాబు అన్నారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్వచ్ఛ భారత్‌, ముద్రరుణాలు, దళిత మహిళలకు స్టాండప్‌స్కీమ్‌, మేకిన్‌ ఇండియా వంటి పథకాలు విస్తృతంగా అమలు చేస్తున్నారని వివరించారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ద్వారా నిరుపేదలకు రూ.5 లక్షల వరకు వైద్య సదుపాయలు, ప్రతిగ్రామానికి ఇంటర్నెట్‌ సదుపాయం కల్పిస్తోందన్నారు.


అర్టికల్‌ 370 రద్దు, ట్రిపుల్‌ తలాక్‌బిల్లు, పౌరసత్య చట్టసవరణ బిల్లు, అయోధ్య రామమందిర సమస్య పరిష్కారం వంటి ఎన్నో శాశ్వతంగా పరిష్కరించిందన్నారు. తొలుత  స్థానిక నాయకులతో కలిసి అమరవీరులైన ఆర్మీ జవాన్‌లకు ఘననివాళులర్పించారు. బీజేపీ నేతలు కంచర్ల హరిప్రసాద్‌, వల్లూరి భావన్నారాయణ, కామరాజుగడ్డ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-18T09:58:58+05:30 IST