బస్సులో ప్రయాణానికి నిబంధనలు
ABN , First Publish Date - 2020-06-07T07:30:57+05:30 IST
బస్సుల్లో ప్రయాణించే వారందరూ తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఆర్టీసీ ఆర్ఎం ఎస్టీపీ
ఆర్టీసీ ఆర్ఎం రాఘవకుమార్
చిలకలూరిపేట, జూన్ 6: బస్సుల్లో ప్రయాణించే వారందరూ తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఆర్టీసీ ఆర్ఎం ఎస్టీపీ రాఘవకుమార్ పేర్కొన్నారు. చిలకలూరిపేట ఆర్టీసీ డిపోను శనివారం సందర్శించిన ఆయన మాట్లాడుతూ రీజియన్ పరిధిలో మొత్తం 82 బస్సు సర్వీసులను నడుపుతున్నామన్నారు. ఆన్లైన్ బుకింగ్ చేసుకుని రోజుకు 3వేలకుపైగా ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణిస్తున్నారన్నారు. ప్రజల అవసరాన్ని బట్టి సర్వీసులు పెంచుతామన్నారు. రీజియన్ పరిధిలో రోజూ రూ.కోటి వరకు నష్టం వస్తోందన్నారు. ఆదాయం పెంపొందించే క్రమంలో భాగంగా కార్గో పార్శిల్ సర్వీసులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.