మహా పాదయాత్రను జయప్రదం చేయండి

ABN , First Publish Date - 2020-12-11T05:30:00+05:30 IST

రైతులకు మద్దతుగా అమరావతి పరిరక్షణ సమితి శనివారం చేపట్టిన మహాపాదయాత్రను జయప్రదం చేయాలని గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ తెనాలి శ్రావణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

మహా పాదయాత్రను జయప్రదం చేయండి
సమావేశంలో ప్రసంగిస్తున్న టీడీపీ నేతలు శ్రావణ్‌ కుమార్‌, నాని , ప్రభాకర్‌ తదితరులు

టీడీపీ నేతలు శ్రావణ్‌ కుమార్‌, కోవెలమూడి రవీంద్ర

గుంటూరు, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): రైతులకు మద్దతుగా అమరావతి పరిరక్షణ సమితి శనివారం చేపట్టిన మహాపాదయాత్రను జయప్రదం చేయాలని గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ తెనాలి శ్రావణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన అధ్యక్షతన పశ్చి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగించి. ఈ సందర్భంగా నియోజకవర్గ  ఇన్‌ఛార్జ్‌ కోవెలమూడి రవీంద్ర పార్టీ బలోపేతానికై పలు సూచనలు చేశారు. గుంటూరు నగరంలో లాక్‌డౌన్‌ కాలంలో తీవ్రంగా నష్టపోయిన వ్యాపారవర్గాలకు 6నెలల వాణిజ్య పన్ను మినహాయింపు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ డేగల తీర్మానం ప్రవేశపెట్టారు. సమావేశంలో నేతలు మానుకొండ శివప్రసాద్‌, కనపర్తి శ్రీనివాసరావు, కంచర్ల శివరామయ్య, ముత్తినేని రాజేష్‌, కసుకుర్తి హనుమంతరావు, మల్లె విజయ, పానకాల వెంకట మహాలక్ష్మిలతో పాటు డివిజన్‌ ఇన్‌చార్జులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

     

Updated Date - 2020-12-11T05:30:00+05:30 IST