30 మంది టీడీపీలో చేరిక
ABN , First Publish Date - 2020-12-02T05:14:30+05:30 IST
స్థానిక 12వ డివిజన్లో 30మంది యువకులు మంగళవారం తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి నసీర్అహమద్ ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరారు.

గుంటూరు(తూర్పు), డిసెంబరు1: స్థానిక 12వ డివిజన్లో 30మంది యువకులు మంగళవారం తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి నసీర్అహమద్ ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరారు. నసీర్ టీడీపీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలపై పోరాడేది ఒక్క టీడీపీయేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో షబ్బీర్, అఫ్రోజ్, బబ్లు, మీరా, ఖదీర్, సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.