హెచ్‌ఐవీ సోకిందని గొంతుకోసుకుని ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-31T05:28:31+05:30 IST

పట్టణంలోని ఇందిరాకాలనీకి చెందిన ఓ వ్యక్తి తనకు హెచ్‌ఐవీ సోకిందని గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు త్రీ టౌన్‌ ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపారు.

హెచ్‌ఐవీ సోకిందని గొంతుకోసుకుని ఆత్మహత్య

తెనాలి రూరల్‌, డిసెంబరు 30: పట్టణంలోని ఇందిరాకాలనీకి చెందిన ఓ వ్యక్తి తనకు హెచ్‌ఐవీ సోకిందని గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు  త్రీ టౌన్‌ ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపారు. లారీ డ్రైవర్‌గా పని చేసే ఇతడికి ఇటీవల హెచ్‌ఐవీ సోకింది. అప్పటి నుంచి మనోవేదనకు గురయ్యాడు. ఈ విషయం బయటివారికి తెలిస్తే తలెత్తుకుని తిరగలేమని మధనపడుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున ఇంట్లో కత్తిపీటతో మెడను కోసుకున్నాడు. కొనఊపిరితో ఉన్న అతడిని కుటుంబసభ్యులు గుర్తించి జిల్లా ప్రభుత్వవైద్యశాలకు తరలించారు. చికిత్ర పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2020-12-31T05:28:31+05:30 IST