చెరువులో పడి విద్యార్థి మృతి
ABN , First Publish Date - 2020-03-18T11:03:51+05:30 IST
రూరల్ మండలం పెదపలకలూరులో చెరువులో పడి మంగళవారం పి.అనిల్కుమార్ (19) మృతి చెందాడు. ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న అతను గేదెలు
![చెరువులో పడి విద్యార్థి మృతి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
గుంటూరు (సంగడిగుంట), మార్చి 17: రూరల్ మండలం పెదపలకలూరులో చెరువులో పడి మంగళవారం పి.అనిల్కుమార్ (19) మృతి చెందాడు. ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న అతను గేదెలు తోలుకుని గ్రామంలోని చెరువుకు వెళ్ళాడు. ఈతకని దిగి బయటకు రాకపోయే సరికి స్నేహితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు మృతదేహాన్ని బయటకు తీ శారు. నల్లపాడు పోలీసులు కేసుదర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు కృష్ణ, పద్మలు కుమారుడి ఆకస్మికమృతితో కన్నీరు మున్నీరయ్యారు.