జీజీహెచ్‌లో కలకలం

ABN , First Publish Date - 2020-07-19T10:29:28+05:30 IST

గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిలో శనివారం కరోనా వైరస్‌ కలకలం రేగింది. శనివారం నిర్వహించిన వైద్య

జీజీహెచ్‌లో కలకలం

హోం క్వారంటైన్‌కు సూపరింటెండెంట్‌ 

ఇన్‌చార్జిగా ప్లాసిక్‌ సర్జరీ హెచ్‌వోడీ

ప్రభుత్వాస్పత్రిలో 9 మందికి పాజిటివ్‌


గుంటూరు (మెడికల్‌) జూలై 18: గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిలో శనివారం కరోనా వైరస్‌ కలకలం రేగింది. శనివారం నిర్వహించిన వైద్య పరీక్షల్లో 9 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. పరిపాలన విభాగంలో కీలక అధికారితో పాటు డైట్‌సెక్షన్‌ ఇన్‌చార్జ్‌గా వ ్యవహరిస్తున్న వైద్యుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.


వీరిద్దరిని బీ క్లాస్‌ రూమ్‌లో చేర్చారు. కాగా శనివారం వైద్య సిబ్బందికి, మినిస్టీరియల్‌ సిబ్బందికి నిర్వహించిన పరీక్షల్లో నలుగురు మినిస్టీరియల్‌ సిబ్బంది, ఇద్దరు ఫార్మసిస్టులు కూడా కరోనాకు గురైనట్లు నిర్ధారించారు. సూపరింటెండెంట్‌ చాంబర్‌ వద్ద విధులు నిర్వహించే సెక్యూరిటీ గార్డుకు పాజిటివ్‌ వచ్చింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కే సుధాకర్‌ హోం క్వారంటైన్‌కు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌గా ప్లాస్టిక్‌ సర్జరీ హెచ్‌వోడీ డాక్టర్‌ మార్కాండేయులు శనివారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. 

Updated Date - 2020-07-19T10:29:28+05:30 IST