నిలకడగా వరద ఉధృతి
ABN , First Publish Date - 2020-10-21T11:58:39+05:30 IST
ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణా నదికి వరద ఉధృతి నిలకడగా ఉంది. మంగళవారం సాయంత్రానికి పులిచింతల, బ్యారేజి ఎగువన ఉన్న వివిధ వాగుల నుంచి 5,34,000 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది.

తాడేపల్లి టౌన్, అక్టోబర్ 20: ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణా నదికి వరద ఉధృతి నిలకడగా ఉంది. మంగళవారం సాయంత్రానికి పులిచింతల, బ్యారేజి ఎగువన ఉన్న వివిధ వాగుల నుంచి 5,34,000 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. దిగువకు 5,,32,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు 2,500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజి రిజర్వాయర్ వద్ద 14.3 అడుగుల నీటి మట్టం కొనసాగిస్తూ మొత్తం 70 గేట్లను పూర్తిగా ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నట్లు జేఈ దినేష్ తెలిపారు.
పశ్చిమ డెల్టాకు 1,516 క్యూసెక్కులు
దుగ్గిరాల, అక్టోబరు 20: ప్రకాశం బ్యారేజి నుంచి కృష్ణా పశ్చిమ డెల్టాకు మంగళవారం 1,516 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బ్యారేజివద్ద నీటిమట్టం 14.4 అడుగులు ఉండగా దిగువకు 5,38,867 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దుగ్గిరాల సబ్డివిజన్ నుంచి హైలెవెల్ ఛానల్కు 70, రేపల్లె కాలువకు150, తూర్పు కాలువకు 145, పశ్చిమ కాలువకు 65, నిజాంపట్నం కాలువకు 150, కొమ్మమూరు కాలువకు 1,465 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.