టీం గేమ్స్ మినహాయింపుపై హర్షం
ABN , First Publish Date - 2020-11-27T05:28:34+05:30 IST
జీవో 74లోని క్లాజ్ 10 నుంచి టీం గేమ్స్ను మినహాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హెచ్ ఫౌండేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

గుంటూరు(క్రీడలు): జీవో 74లోని క్లాజ్ 10 నుంచి టీం గేమ్స్ను మినహాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హెచ్ ఫౌండేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయవాడలోని శాఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ రమణను కలసి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎర్ర ప్రవీణ్కుమార్, హరగోపాల్, గోపి, చాంద్ తదితరులు పాల్గొన్నారు.