నెలాఖరు వరకు దుకాణాలు మూసేయాల్సిందే ...
ABN , First Publish Date - 2020-03-24T09:41:38+05:30 IST
కరోనా వైరస్ నివారణంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగగా దుకాణాలు మూసివేయాలని ఇండియన్ చాంబర్ ...
గుంటూరు, మార్చి 23: కరోనా వైరస్ నివారణంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగగా దుకాణాలు మూసివేయాలని ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు వ్యాపారులకు పిలుపునిచ్చారు. గుంటూరు జిన్నాటవర్ సెంటర్లోని చాంబర్ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లాక్డౌన్కు వ్యాపారవర్గాలు సహకరించాలని కోరారు.