నేడు ఇన్పుట్ సబ్సిడీ విడుదల
ABN , First Publish Date - 2020-12-29T05:51:36+05:30 IST
నవంబరులో వచ్చిన నివర్ తుఫాన్లో నష్టపోయిన రైతులకు మంగళవారం రాష్ట్రప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేస్తోంది.
గుంటూరు, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): నవంబరులో వచ్చిన నివర్ తుఫాన్లో నష్టపోయిన రైతులకు మంగళవారం రాష్ట్రప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిధులను విడుదల చేస్తారు. జిల్లాలో 81,993.48 హెక్టార్లలో ఏడురకాల వ్యవసాయ పంటలకు సంబంధించి 1,45,230 మంది రైతులకు రూ.1,22,92,56,760 పరిహారం, 3,733.81 హెక్టార్లలో ఎనిమిది రకాల ఉద్యానపంటలకు సంబంధించి 7,599 మంది రైతులకు రూ,5.37 కోట్ల పరిహారం విడుదల చేస్తున్నారు. కలెక్టరేట్లో జరిగే ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు.